గగన గంగా వాహిని
ముల్లోకములను కారుణ్యముఁగను మూకాంబ ప్రణతులమ్మా!
యుల్లమ్ము నిలిపి, బాల్యమ్ము మొదలు యూహించి కొలుచు నాలో,
నుల్లాసమమర, దీవింప బ్రదుకు నుప్పొంగు కడలి కాగా,
తల్లీల మురిసి పద్యానఁదలచి ధన్యాస్మి యనుచు నుందున్.
-- లక్ష్మీదేవి
చిత్రత్వరితా.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి