దివ్యాలంకృతమైన ఛందములలో దీపించు శబ్దాళితో
నవ్యానందమునిచ్చుచుండు ఝరితో జ్ఞానార్థ సంసిద్ధితో
కావ్యాడంబరమందు మేలురకమై కైవల్యమే లక్ష్యమై
సవ్యమ్మై వెలుగొందు సంభ్రమములీ సాహిత్యసౌగంధముల్.
దివ్యాలంకృతమైన రూపసిరితో దీపించు వాగ్ధాటితో
భవ్యాడంబరమైన శబ్దఝరినిన్ భావమ్ము నిండారగా
నవ్యమ్మై వెలుగొందు బోధనముతో నాణ్యమ్ము నింపారగా
సవ్యంబౌ విధి మార్గదర్శివయి కృష్ణా! పార్థుఁ బాలింతువో!
--లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితములు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి