బాల్యములో పోతన తన తల్లిదండ్రులతో నాటకం గురించి సందేహాలనడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడం, అందులోని తాత్వికతను లౌకికముగా కానదగిన విషయసమాచారంతో నిరూపించి చెప్పడం సుప్రసిద్ధ కవి వానమామలై వరదాచార్య విరచిత 'పోతన చరిత్రము' కావ్యములో ఒకానొక (కల్పితమైన ?) చక్కటి సన్నివేశము.
-
వచ్చుచుఁ బోవుచుండె నటవర్గము లోనికదేల యన్నచోఁ
జచ్చుచుఁ బుట్టుచుండె జనసంఘము భూస్థలినేలయంచు వా
రెచ్చట కేఁగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచు
న్బుచ్చునొ యట్టి సూత్రధరు పొంతకుఁ బోదురటంచుఁ బల్కినన్.
"వస్తూ పోతూ ఉన్నారేం ఈ నటులు లోపలికి?"
"చస్తూ పుడుతూ జనులు భూమిలో ఉండడం లేదూ అలాగే."
"ఎక్కడికి వెళ్తున్నారలా?" "ఎవడు వారికీ వేషం కట్టి
పంపాడో ఆ సూత్రధారి దగ్గరకే"
ఏఁగిన వీరిఁగాంచి యతఁడేమని పల్కునటన్న వారి వే షాగతులంబొనర్చి యెటులాడుఁడు పాడుఁడటంచుఁ దెల్పెనో
యాగతి యాడిపాడిన నహా! యని వారల మెచ్చు నిచ్చు మే
ల్భోగములట్లు జేయమిని పొండని దండనఁ జేయువాఁడనన్.
" అలా వెళ్ళిన వారిని చూసి అతడేమంటాడు?"
" వారి వేషాలను ఎలా ఆడిపాడమని చెప్పాడో అలా
చేస్తే ఆహా అని మెచ్చి మరిన్ని మంచి భోగాలనిచ్చి చేయనివారిని
పొండని దండన చేస్తాడు"
-
ఇలా సాగుతుంది.
అందమైన పద్యాలు, చక్కటి ధార, సన్నివేశకల్పన, సహజవర్ణన.
--
పరిచయం చేసిన సన్మిత్రుల పట్ల కృతజ్ఞురాలను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి