31, అక్టోబర్ 2016, సోమవారం
భారతదేశం విడిపోయిందెప్పుడెప్పుడు?
లేబుళ్లు:
దేశ భక్తి,
నా గోల,
మనసులో మాట
4, అక్టోబర్ 2016, మంగళవారం
వీరావేశం
పేస్బుక్ లో సుధీర్ కుమార్ , ఎమ్మిగనూరు గారి పోస్ట్.
2016 సెప్టెంబర్ 29 భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. కడచిన నాలుగున్నర దశాబ్దాల్లో మొట్టమొదటిసారి మన సైనిక బలగాలు మాటువేసి, గీతదాటి, పాకిస్తాన్కి దానికి అర్థమయ్యే భాషలో, జన్మలో మరవలేని గుణపాఠం నేర్పాయి. అదీ ప్రపంచంలో ఎవరూ వంకపెట్టలేని రీతిలో! దెబ్బతిన్నవారే కనీసం తమకు దెబ్బతగిలిందని చెప్పుకోలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండక తప్పని విధంగా!
విభజన వెనువెంటనే రెయిడర్ల ముసుగులో సైనికదాడి మొదలుకుని కార్గిల్ యుద్ధం దాకా ఇప్పటికి జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ, సరిహద్దుల వెంబడి చెదురుమదురు ఘర్షణల్లోనూ బరితెగింపు పాకిస్తాన్ది; ప్రతిస్పందన మనది. మదించిన విరోధి మీద మనమే చొరవ తీసుకుని మెరపు దాడి చేయటం ఇదే మొదలు.
ఉరీలో భారత సైనిక స్థావరం మీద దొంగదాడి చేసినవారిని, వారిని ఉసికొలిపిన వారిని శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు నిజంగానే ఆయన అంతపనీ చేయగలడని పాకిస్తాన్ ఊహించి ఉండదు. తన చెప్పుచేతల్లోని పెంపుడు టెర్రరిస్టులను ప్రయోగించి ఇండియాలో భయానక విధ్వంసానికీ, దారుణ మారణకాండకూ పాల్పడిన ప్రతిసారీ ఇక్కడి ప్రభుత్వాల నుంచి వట్టి అరుపులే తప్ప గట్టి జవాబు లేకపోవటంతో మెత్తటి వారిని విడవకుండా మొత్తటమే పాకిస్తాన్ పాలిసీగా పెట్టుకుంది. భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన పార్లమెంటు మీదే తాను దుర్మార్గంగా దాడి చేయించినా... అప్పటి వాజపేయి ప్రభుత్వం ‘ఆపరేషన్ పరాక్రమ్’తో తెగ హడావుడి చేసి సరిహద్దులకు సేనలను తరలించటమే తప్ప, వాటిని పొలిమేర దాటించే పరాక్రమాన్ని చూపించ లేకపోవటం పాకిస్తాన్కి అలుసు అయింది. 2008లో ముంబయిని ముట్టడించి వందల ప్రాణాలు బలిగొన్నప్పుడు అధీనరేఖ ఆవల మెరపు దాడులకు మన్మోహన్ సర్దార్జీ ఆలోచన మాత్రం చేసి, ఆచరణలో తోక ముడవటంతో ఇస్లామాబాద్కి మనమంటే భయం లేకుండా పోయింది. తాజాగా ఉరీ సైనిక స్థావరంపై తీరి కూర్చుని తాము దొంగదాడి చేయించాక ప్రధాని నరేంద్రమోదీ చేసిన తీవ్ర హెచ్చరికనూ షరామామూలు తాటాకు చప్పుడుగానే పాకిస్తానీలు పరిగణించారు. వెనకటి పాలకులవలె మోది మెతక మనిషి కాడని తెలుసు కనుక యుద్ధ్భేరి మోగిస్తాడేమోనని ఊహించి, అధీనరేఖ వెంబడి బలగాలను పటిష్ఠపరచి, ‘దురాక్రమణ’పై గగ్గోలుకు వారు సిద్ధంగా ఉన్నారు. కాని - ఇంత ఒడుపుగా, మెరపు వేగంతో సైనిక దళాలను దూకించి, తన ఇలాకాలోని టెర్రరిస్టు అడ్డాలను బద్దలు కొట్టించి, తమకు దిమ్మతిరిగేట్టు అతడు చెయ్యగలడని వారు కలనైనా అనుకుని ఉండరు.
గీతకు అవతల ప్రాంతం పాక్ అధీనంలో ఉన్నా వాస్తవానికి అది కూడా మనదే. 1947లో పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ఆ భూమిమీద మనకు సర్వహక్కులూ ఉన్నాయి. ఆ సంగతి భారత పార్లమెంటు 1994లోనే ఏకగ్రీవ తీర్మానం ద్వారా లోకానికి నొక్కి చెప్పింది. కాబట్టి నిన్న భారత దళాలు చొచ్చుకు వెళ్లింది పాకిస్తాన్ భూభాగం మీదికి కాదు. ఐక్యరాజ్య సమితి పంచాయతీ ప్రకారం అది తన అధీనంలో ఉన్నది కాబట్టి, అందులో అడుగు పెట్టటం తమ మీద దురాక్రమణ అనీ పాకీలు అనలేరు. ఎందుకంటే భారత దళాలు దాడిచేసింది పాక్ సైన్యం మీద కాదు. భారత భద్రతకు ముప్పుగా తయారైన టెర్రరిస్టుల పుట్టలమీద! టెర్రరిస్టు చర్యలను నివారించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవటం అన్ని రాజ్యాల బాధ్యత అని ఐక్యరాజ్యసమితి చార్టరు 8వ అధ్యాయం ఘోషిస్తున్నది. అధీనరేఖ అవతల పుట్టుకొచ్చిన ఉగ్రవాద పుట్టగొడుగులను పెకలించటం ద్వారా భారతదేశం ఆ అంతర్జాతీయ బాధ్యతనే నిర్వర్తించింది.
అది తప్పు అనే దమ్ము పాకిస్తానీలకు లేదు.
అధీనరేఖ వెంబడి టెర్రరిస్టు శిబిరాలు లేవు; వాటికి తన వత్తాసూ లేదు అని ఇస్లామాబాద్ ఇప్పటిదాకా గొంతు చించుకున్నది. అదే ఇప్పుడు దాని గొంతులో వెలక్కాయ అయింది. తానే లేవని చెప్పిన ఉగ్రవాద శిబిరాలను భారత దళాలు ధ్వంసం చేశాయని, లేరని తాను పలికిన ఉగ్రవాదులను మట్టుపెట్టాయని ఒప్పుకుంటే దాని బండారమే బయటపడుతుంది. టెర్రరిస్టు కుంపట్లను ఆర్పే క్రమంలో పాక్ సైనికులు నలుగురు భారత చేతిలో హతమయ్యారని అంగీకరిస్తే ఆ కుంపట్లను రాజేసింది తానేనన్న గుట్టూ రట్టు అవుతుంది. పోనీ తన భూభాగాన్ని ఇండియా ఆక్రమించిందని గోల పెడదామా అనుకుంటే దానికీ సందు ఇవ్వకుండా భారత దళాలు లక్ష్యాన్ని ఛేదించిన వెంటనే మెరపు వేగంతో వెనక్కి మరలాయి. పాకిస్తాన్ని గాని, దాని మిలిటరీని గాని పల్లెత్తుమాట అనకపోవటమే కాదు. మానవాళికి శత్రువు అయిన ఉగ్రవాదాన్ని పీచమణచేందుకు కలిసి పని చేద్దామనీ భారత సైన్యాధికారి తెలివిగా సాదరహస్తం చాచాడు. ఇక ఏమీ చెయ్యలేకే, అల్లరి చేస్తే తానే అల్లరిపాలవుతానన్న భయంచేతే అసలు మెరపు దాడే జరగలేదని ఇస్లామాబాద్ పాచినోటితో పచ్చి అబద్ధమాడుతున్నది.
‘సర్జికల్ దాడి’ని సరిహద్దు ఘర్షణగా చిత్రించి పాక్ మిలిటరీ, దాని అదుపులోని ప్రధాని, పాకిస్తానీ పత్రికలు అసలు నిజాన్ని దాచేందుకు, భంగపాటుకు కప్పిపుచ్చేందుకు ఎన్ని ఆపసోపాలు పడితేనేమి? ఎంత ఆక్రోశం వెళ్లగక్కితేనేమి? సరిహద్దు పొడవునా పాక్ సేనలు, సైనిక విమానాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా గీత అవతలికి చొచ్చుకువెళ్లి వీరోచితంగా పని పూర్తిచేయటం భారత సేన శౌర్యపరాక్రమాలకు కొండ గుర్తు. 1965, 1971 నాటి భారత సైనిక దిగ్విజయాలను గుర్తుకు తెచ్చే రీతిలో ఎవరూ ఆక్షేపించలేని విధంగా సైనిక చర్య జరిపించి తాను చేతల మనిషినని నిరూపించి, ప్రతీకారం కోసం రగిలిపోతున్న భారత ప్రజావళికి సాంత్వన చేకూర్చిన న.మో. నాయకత్వ దక్షతకు జేజేలు. సింహం కదిలాక నక్కల ఆటలు సాగవు.
2016 సెప్టెంబర్ 29 భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. కడచిన నాలుగున్నర దశాబ్దాల్లో మొట్టమొదటిసారి మన సైనిక బలగాలు మాటువేసి, గీతదాటి, పాకిస్తాన్కి దానికి అర్థమయ్యే భాషలో, జన్మలో మరవలేని గుణపాఠం నేర్పాయి. అదీ ప్రపంచంలో ఎవరూ వంకపెట్టలేని రీతిలో! దెబ్బతిన్నవారే కనీసం తమకు దెబ్బతగిలిందని చెప్పుకోలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండక తప్పని విధంగా!
విభజన వెనువెంటనే రెయిడర్ల ముసుగులో సైనికదాడి మొదలుకుని కార్గిల్ యుద్ధం దాకా ఇప్పటికి జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ, సరిహద్దుల వెంబడి చెదురుమదురు ఘర్షణల్లోనూ బరితెగింపు పాకిస్తాన్ది; ప్రతిస్పందన మనది. మదించిన విరోధి మీద మనమే చొరవ తీసుకుని మెరపు దాడి చేయటం ఇదే మొదలు.
ఉరీలో భారత సైనిక స్థావరం మీద దొంగదాడి చేసినవారిని, వారిని ఉసికొలిపిన వారిని శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు నిజంగానే ఆయన అంతపనీ చేయగలడని పాకిస్తాన్ ఊహించి ఉండదు. తన చెప్పుచేతల్లోని పెంపుడు టెర్రరిస్టులను ప్రయోగించి ఇండియాలో భయానక విధ్వంసానికీ, దారుణ మారణకాండకూ పాల్పడిన ప్రతిసారీ ఇక్కడి ప్రభుత్వాల నుంచి వట్టి అరుపులే తప్ప గట్టి జవాబు లేకపోవటంతో మెత్తటి వారిని విడవకుండా మొత్తటమే పాకిస్తాన్ పాలిసీగా పెట్టుకుంది. భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన పార్లమెంటు మీదే తాను దుర్మార్గంగా దాడి చేయించినా... అప్పటి వాజపేయి ప్రభుత్వం ‘ఆపరేషన్ పరాక్రమ్’తో తెగ హడావుడి చేసి సరిహద్దులకు సేనలను తరలించటమే తప్ప, వాటిని పొలిమేర దాటించే పరాక్రమాన్ని చూపించ లేకపోవటం పాకిస్తాన్కి అలుసు అయింది. 2008లో ముంబయిని ముట్టడించి వందల ప్రాణాలు బలిగొన్నప్పుడు అధీనరేఖ ఆవల మెరపు దాడులకు మన్మోహన్ సర్దార్జీ ఆలోచన మాత్రం చేసి, ఆచరణలో తోక ముడవటంతో ఇస్లామాబాద్కి మనమంటే భయం లేకుండా పోయింది. తాజాగా ఉరీ సైనిక స్థావరంపై తీరి కూర్చుని తాము దొంగదాడి చేయించాక ప్రధాని నరేంద్రమోదీ చేసిన తీవ్ర హెచ్చరికనూ షరామామూలు తాటాకు చప్పుడుగానే పాకిస్తానీలు పరిగణించారు. వెనకటి పాలకులవలె మోది మెతక మనిషి కాడని తెలుసు కనుక యుద్ధ్భేరి మోగిస్తాడేమోనని ఊహించి, అధీనరేఖ వెంబడి బలగాలను పటిష్ఠపరచి, ‘దురాక్రమణ’పై గగ్గోలుకు వారు సిద్ధంగా ఉన్నారు. కాని - ఇంత ఒడుపుగా, మెరపు వేగంతో సైనిక దళాలను దూకించి, తన ఇలాకాలోని టెర్రరిస్టు అడ్డాలను బద్దలు కొట్టించి, తమకు దిమ్మతిరిగేట్టు అతడు చెయ్యగలడని వారు కలనైనా అనుకుని ఉండరు.
గీతకు అవతల ప్రాంతం పాక్ అధీనంలో ఉన్నా వాస్తవానికి అది కూడా మనదే. 1947లో పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ఆ భూమిమీద మనకు సర్వహక్కులూ ఉన్నాయి. ఆ సంగతి భారత పార్లమెంటు 1994లోనే ఏకగ్రీవ తీర్మానం ద్వారా లోకానికి నొక్కి చెప్పింది. కాబట్టి నిన్న భారత దళాలు చొచ్చుకు వెళ్లింది పాకిస్తాన్ భూభాగం మీదికి కాదు. ఐక్యరాజ్య సమితి పంచాయతీ ప్రకారం అది తన అధీనంలో ఉన్నది కాబట్టి, అందులో అడుగు పెట్టటం తమ మీద దురాక్రమణ అనీ పాకీలు అనలేరు. ఎందుకంటే భారత దళాలు దాడిచేసింది పాక్ సైన్యం మీద కాదు. భారత భద్రతకు ముప్పుగా తయారైన టెర్రరిస్టుల పుట్టలమీద! టెర్రరిస్టు చర్యలను నివారించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవటం అన్ని రాజ్యాల బాధ్యత అని ఐక్యరాజ్యసమితి చార్టరు 8వ అధ్యాయం ఘోషిస్తున్నది. అధీనరేఖ అవతల పుట్టుకొచ్చిన ఉగ్రవాద పుట్టగొడుగులను పెకలించటం ద్వారా భారతదేశం ఆ అంతర్జాతీయ బాధ్యతనే నిర్వర్తించింది.
అది తప్పు అనే దమ్ము పాకిస్తానీలకు లేదు.
అధీనరేఖ వెంబడి టెర్రరిస్టు శిబిరాలు లేవు; వాటికి తన వత్తాసూ లేదు అని ఇస్లామాబాద్ ఇప్పటిదాకా గొంతు చించుకున్నది. అదే ఇప్పుడు దాని గొంతులో వెలక్కాయ అయింది. తానే లేవని చెప్పిన ఉగ్రవాద శిబిరాలను భారత దళాలు ధ్వంసం చేశాయని, లేరని తాను పలికిన ఉగ్రవాదులను మట్టుపెట్టాయని ఒప్పుకుంటే దాని బండారమే బయటపడుతుంది. టెర్రరిస్టు కుంపట్లను ఆర్పే క్రమంలో పాక్ సైనికులు నలుగురు భారత చేతిలో హతమయ్యారని అంగీకరిస్తే ఆ కుంపట్లను రాజేసింది తానేనన్న గుట్టూ రట్టు అవుతుంది. పోనీ తన భూభాగాన్ని ఇండియా ఆక్రమించిందని గోల పెడదామా అనుకుంటే దానికీ సందు ఇవ్వకుండా భారత దళాలు లక్ష్యాన్ని ఛేదించిన వెంటనే మెరపు వేగంతో వెనక్కి మరలాయి. పాకిస్తాన్ని గాని, దాని మిలిటరీని గాని పల్లెత్తుమాట అనకపోవటమే కాదు. మానవాళికి శత్రువు అయిన ఉగ్రవాదాన్ని పీచమణచేందుకు కలిసి పని చేద్దామనీ భారత సైన్యాధికారి తెలివిగా సాదరహస్తం చాచాడు. ఇక ఏమీ చెయ్యలేకే, అల్లరి చేస్తే తానే అల్లరిపాలవుతానన్న భయంచేతే అసలు మెరపు దాడే జరగలేదని ఇస్లామాబాద్ పాచినోటితో పచ్చి అబద్ధమాడుతున్నది.
‘సర్జికల్ దాడి’ని సరిహద్దు ఘర్షణగా చిత్రించి పాక్ మిలిటరీ, దాని అదుపులోని ప్రధాని, పాకిస్తానీ పత్రికలు అసలు నిజాన్ని దాచేందుకు, భంగపాటుకు కప్పిపుచ్చేందుకు ఎన్ని ఆపసోపాలు పడితేనేమి? ఎంత ఆక్రోశం వెళ్లగక్కితేనేమి? సరిహద్దు పొడవునా పాక్ సేనలు, సైనిక విమానాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా గీత అవతలికి చొచ్చుకువెళ్లి వీరోచితంగా పని పూర్తిచేయటం భారత సేన శౌర్యపరాక్రమాలకు కొండ గుర్తు. 1965, 1971 నాటి భారత సైనిక దిగ్విజయాలను గుర్తుకు తెచ్చే రీతిలో ఎవరూ ఆక్షేపించలేని విధంగా సైనిక చర్య జరిపించి తాను చేతల మనిషినని నిరూపించి, ప్రతీకారం కోసం రగిలిపోతున్న భారత ప్రజావళికి సాంత్వన చేకూర్చిన న.మో. నాయకత్వ దక్షతకు జేజేలు. సింహం కదిలాక నక్కల ఆటలు సాగవు.
లేబుళ్లు:
ధన్య వాదాలు,
నా గోల,
శుభాకాంక్షలు
24, ఆగస్టు 2016, బుధవారం
కృష్ణా! నిను నా మనమున......
కం.
కృష్ణా! నిను నా మనమున
విష్ణువునవతారమంచు వేడుచునుందున్,
తూష్ణీకరణమ్మువలదు,
నిష్ణాతుడవీవె మమ్ము నీ కడఁ జేర్పన్.
ఉ.
శ్రావణమాసమందు నిలఁ జల్లగ వచ్చితివంద్రు, వేడుకల్
నీవిట పుట్టినావనుచు, నిర్మల ప్రేమలఁ దేల్చు కృష్ణుడే
దేవుడు మాకటంచు పలు తీరుల పూజల చేసి, భక్తితో
త్రోవల పాదముల్ పువుల తోరణముల్ వెలయింపజేయరే!
చం.
కలకల నవ్వ క్రొవ్విరులు కన్నెలమోముల పూచె నెల్లెడన్
జలజల మంచి ముత్తెములు జాణలపల్కుల జారెనెల్లెడన్
తొలకరి చిన్కులందు కడు తొందరగా నభిషేకమందుచున్
కొలువయె రంగనాథుడదె కోవెలలందున పూజలందగా
మ.
వాన వచ్చిన వేళలందున వాసుదేవుడు పుట్టెనోయ్
కోనలందున కొండలందున కొత్త శోభలు తోచెనోయ్
చేనులందున చెమ్మ చేరెను చెట్టు చేమలు హెచ్చెనోయ్
వీనువిందుగ గానమాధురి పేరటాళ్ళిలఁ దేలగా
పం.
నమామి కృష్ణ దేవదేవ నారదాది సన్నుతా
అమేయ సత్కృపానిధీ జయమ్ము మంగళమ్ములన్
ప్రమోదమంద పాడుచుంటి పంకజాక్ష పాహిమాం
రమాపతీ! సదా జగమ్ము రక్షసేయుచుండుమా!
---------లక్ష్మీదేవి
లేబుళ్లు:
దైవం,
ధన్య వాదాలు,
నా గోల,
మనసులో మాట
28, ఏప్రిల్ 2016, గురువారం
ముక్తి
మనసు మూగదనుచు జాలి మానగవలెనోయి! మూగ
తనమేమొ, మనుజుని తనదు దారినిఁ గొనిపోవుచుండు,
కనుమయ్య! కట్టివేయగల కాఠిన్యమొకయింత లేక
మునుగుచునుందురు జగతి, మోహపు సాగరమందు.
ఎల్ల మరచి యాటపాటలేను గొప్పవటంచు నుంద్రు
కల్ల కపటములు లేని కలకల నగవుల బాల్య
మెల్ల, పిదప లోకములను మిగుల బాగుపరచ కాల
మెల్ల గడుపుచుందు,రేమి మేళులు చేయగ జాలు?
నిజమునెరుగునంతలోన నేల విడుచుకాలమౌను,
సజలనయనములతోడ శంకరుని పదము చేరి,
భజన చేయుచు వేడుకొంద్రు పాహి పాహియనుచు, నిట్టి
ప్రజలకు బుద్ధినిఁ గలిగి బ్రదుక, వరములియ్యవయ్య!
తొలగించగా యీతి బాధ తుదకైన కరుణించవేమి?
శిలవోలె నిలిచితి జాలి చిలుకంగ రావే యదేమి?
కలనైనఁ గనిపించి దారి కానగఁ జేయుమో స్వామి!
యిలపైన వేసట గలిగె యెప్పుడు పిలిపింతువేమి?
పశువునుఁ గాటన కట్టుపగిదిని నేర్పరాదొక్కొ!
నిశియందునహమందు నెపుడు నీమ్రోల నుంచరాదొక్కొ!
వశుడవీవంద్రు భక్తులకు భాగ్యమదియెగదమాకు,
పశుపతీ! దయజూడవయ్య! పరితపించెడు వారిపైన.
----లక్ష్మీదేవి.
లేబుళ్లు:
ధన్య వాదాలు,
నా గోల,
నా రాతలు,
మనసులో మాటలు
15, ఏప్రిల్ 2016, శుక్రవారం
సద్వ్యాపారముల్ నేర్పుమా!
ఒక్క పుత్రకామేష్టిని యోగమబ్బె,
రెండు చేతుల ప్రాప్తించె దండి ఫలము.
మువ్వురు సతులకొసగగ మురిపెముగను,
నల్వురదొ సుతులు జనించినారు కనుఁడు.
రెండు చేతుల ప్రాప్తించె దండి ఫలము.
మువ్వురు సతులకొసగగ మురిపెముగను,
నల్వురదొ సుతులు జనించినారు కనుఁడు.
పంచచామరము
కులీనుడైన రాజు నిండుకుండ తీరు మానుచున్,
భలే భళీ యటంచు ముద్దు పాపలన్ ముదమ్మునన్
విలాసరీతి నుయ్యెలన్ వివేక గీతి పాడి వా
రలెల్లరన్ పరుండజేయు రాజసమ్ము చూడుమా!
భలే భళీ యటంచు ముద్దు పాపలన్ ముదమ్మునన్
విలాసరీతి నుయ్యెలన్ వివేక గీతి పాడి వా
రలెల్లరన్ పరుండజేయు రాజసమ్ము చూడుమా!
శార్దూలవిక్రీడితము
వీరాగ్రేసర! ధాత్రికన్యకతమున్ వేవేల క్రూరాత్ములన్,
ధీరోదాత్తతతోడఁ గూల్చితి, భళా! దేవా! భువిన్ క్రూరతన్
స్వైరమ్మాడెడు ధూర్తమానవులకున్ సద్భావముల్, కూర్మితో
వైరమ్మెల్ల హరింపజేయగల సద్వ్యాపారముల్ నేర్పుమా!
ధీరోదాత్తతతోడఁ గూల్చితి, భళా! దేవా! భువిన్ క్రూరతన్
స్వైరమ్మాడెడు ధూర్తమానవులకున్ సద్భావముల్, కూర్మితో
వైరమ్మెల్ల హరింపజేయగల సద్వ్యాపారముల్ నేర్పుమా!
లేబుళ్లు:
దైవం,
నా రాతలు,
పండుగ,
భక్తి గీతాలు,
భాషకై,
శుభాకాంక్షలు
6, మార్చి 2016, ఆదివారం
21, ఫిబ్రవరి 2016, ఆదివారం
బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా!
వీరసేనల ఊపిరాగెను నీకు ఊపిరులూదగా
దేశభక్తుల గుండెలాగెను నీదు ఆయువుపెంచగా|
ప్రజలసేమము కోరుధీరులుసాగిరసువులుబాయగా
ధ్వజము నిలుపుట పరమ ధర్మమ్మను నిజము నీవెఱుగగా| వీర|
దేశభక్తుల గుండెలాగెను నీదు ఆయువుపెంచగా|
ప్రజలసేమము కోరుధీరులుసాగిరసువులుబాయగా
ధ్వజము నిలుపుట పరమ ధర్మమ్మను నిజము నీవెఱుగగా| వీర|
తాత తండ్రులు అమ్మలక్కలు రూపుదిద్దిన స్వేచ్ఛకే
మాట దెచ్చెడు పనులు మూర్ఖపు చేష్ఠలేవో ఎఱుగరా!
జాతి పతనముఁ జేయు చేతలు ఏలరా? నీకేలరా?|వీర|
మాట దెచ్చెడు పనులు మూర్ఖపు చేష్ఠలేవో ఎఱుగరా!
జాతి పతనముఁ జేయు చేతలు ఏలరా? నీకేలరా?|వీర|
జయపతాకము నిలుచు వరకే కుశలమనునది నీకురా
భయమరాచకమన్నవెల్లను చొరకయుండును ఎఱుగరా
బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా|వీర|
----లక్ష్మీదేవి.
భయమరాచకమన్నవెల్లను చొరకయుండును ఎఱుగరా
బాగు కొఱకై శ్రమించు, భారమయిపోబోకురా|వీర|
----లక్ష్మీదేవి.
లేబుళ్లు:
దేశ భక్తి,
దేశ భక్తి గీతాలు,
నా గోల,
నా రాతలు
24, జనవరి 2016, ఆదివారం
వెన్నెలరేయి
యమునా తటిపై గోమిని సముఖము
కౌముది వెలుగుల సుమకోమలికి..
కమనీయముగా రమణుని శ్వాసే
మురళీరవమై మది దోచునుగా!
లేబుళ్లు:
దైవం,
భాషకై,
మనసులో మాటలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)