ఇన్నాళ్ళయినా ఇన్ని సార్లు రామాయణం చదివినా, ఏదో తన్మయత్వం కలుగక మానదు. చిన్నప్పుడు మా పిన్ని (చిన్నాన్న భార్య ) మాకందరికీ ముద్దలు పెడుతూ ఎన్నిసార్లు రామాయణం చెప్పి ఉంటుందో! అయినా మళ్ళీ చెప్పమని అడిగి చెప్పించుకునే వాళ్ళం.
బాల రామాయణం చూసినప్పుడు ఆ పిల్లల శ్రద్ధకు ముచ్చటేసింది. గుణ శేఖర్ గారు దర్శకత్వం వహించారు. పిల్లలతో చాలా అవస్థలు పడినట్టు చెప్పారని ఎక్కడో చదివిన గుర్తు. అయినా పెద్దలతో అవస్థలు పడాల్సి వస్తున్న కాలంలో ఇది పెద్ద విషయం కాదు.
ధనువు ఘనమిది; ఘనులలో ఘనులు కూడ
పట్టి కదలించరానిది; యెట్టి దిట్ట
యైన దీనిని నెక్కిడ నలవి కాని
వా(డె యగుచుండె; ఇది స్వానుభవము విను(డు.
యఙ్ఞ తలమును పదను జేయంగ( దల(చి
యల్ల నొకనా(డు నా(గలి నంది దున్ను
చుండ, భూగర్భమున దా(గి యుండు నొక్క
పసిది చేపడె నానోము పంట యన(గ.
అదియె నా బిడ్డగా ముద్దులార( బెంచ(
బెరిగి, యౌవనవతి యయి ప్రీతి గూర్చు
చుండె మా ఇంటి వెలు(గౌచు, నిండు గుణము
గలిగి వర్తించు తెలివి తేటలను మించి.
పలుచటి బెల్లపు పానకం గొంతులోంచి జారినట్టుగా తియ్యగా అనిపించింది సుందర రామాయణంలోని ఈ పద్యాలు చదువుతూంటే. మరి మీకో....?