పెద్దలకు నమస్కారము.
గజేంద్రుని ఆర్తికి పద్యరూపం ఇచ్చెందుకు ప్రయత్నించాను.
ఇందులో కథ వివరంగా చెప్పలేదు. క్లుప్తంగా విషయం చెప్పాను.
పెద్దల సూచనలు శిరోధార్యము.
రి దయను గణపతియు, వాణి; రేపవలును నా
మది వీడక కొలువుండగ
కుదురగు బుద్ధిని నిలుపగ కోరుచు నుందున్.
పరుగున నేతెంచి కరిని
హరి గాచిన తీరు యబ్బురమ్మది భువిలో
విరుగగ పాపపు చయములు
సరసముగా జెపుదు నిపుడు ఛందోరీతిన్.
పన్నగశయనుడవయి నెల
కొన్న కమల నయనుడయిన గోవిందా! యా
పన్నుల గాచెడు దయ నీ
కున్నదనుచు నమ్మె యేనుగు తనదు మదిలో
స్థానబలముగల మకరమ
దేనుగు పాదమును బట్టి యీడ్చ,మడుగులో
తానే పోరెదననుకొని
దీనత పొందక జతనము తీరుగ చేసెన్.
కడకా గజమది యోడుచు
మడుగున నిన్నే పిలిచెను మాధవదేవా!
"వడివడిగా వచ్చి నిలిచి
విడు నీ చక్రము" ననుచును వేడెను తానే.
"సృష్టికి నీవే మూలము
భ్రష్టుడనైతిని తెలియక బ్రతుకుననెంతో
నష్టము పొందితి తండ్రీ!
కష్టము గట్టెక్క నన్ను కావగదయ్యా!"
జనకుండెవ్వరు ప్రాణికి,
జననియదెవ్వరు, పతియును, జాయయదెవరో,
కనగా సంతును స్వంతమె?
యని నాకు కలుగగ చింతలచ్యుత! నాథా!"
ఆదియునంతము నీవే
నాదనుదేమియును లేదు, నమ్మితి"ననగా
సాదరముగ కదలి కరిని
నీ దరి చేర్చి కరుణింప నీవేగితివే!
పాపపు చీకటులు తొలుగ
దీపము నీవైన కథల దెలుపుచు, నన్నున్
కాపాడెడు దైవమగుచు,
గోపాలా! వందనమిదె గొనుమా, కృష్ణా!
------------------------లక్ష్మీదేవి.